About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత - "పిల్లతెమ్మెర సాక్షిగా.....!" http://bhamidipatibalatripurasundari.blogspot.in/


 కవిత  - 
"పిల్లతెమ్మెర సాక్షిగా.....!"

ప్రకృతే నేనన్నావు పరవశించానన్నావు
ఆ తేనె మాటలకు నేను పులకరించి పోయాను
నీ అడుగుల సవ్వడి నా హృదయంలో సుడినుడి..
నా హృదయ పీఠం మీద కట్టిస్తాను నీకు గుడి!
చేసేదీ నీవే...చేయించేదీ నీవే...
అక్కడ..ఇక్కడ..ఎక్కడైనా జీవిస్తున్నది నీతోనే!
ప్రతి రాత్రి నీకోసమే శివరాత్రి జాగారం
నీకు లేనే లేదు నాపై మమకారం!
చెట్టు కింద..పుట్ట కింద..గుట్ట కింద చెప్పిన
మథురమైన ఊసులెన్నెన్నో...!
భూత భవిష్యత్తు వర్తమానాల్లో...ఎప్పుడైనా..
పిల్ల తెమ్మెర సాక్షిగా...ఎప్పుడూ ఇదే మాటనీ...!
ఏకవచనం నాకు లేదనీ...
ప్రకృతివి నీవయితే పరమాత్మను నేనని
నమ్మబలికిన నీ మాటను  ఆత్మలో నమ్మి
పరమాత్మవు నీవని కలిపాను నా జీవాత్మను నీలో!
అమాయకపు నా ఆతురత.. నీ చతురతకు లోబడి
భజనల ప్రవాహంలో ఈదులాడి మునకలేసి
చన్నీటి జలాల చల్లబడి నురుగునై ఒడ్డుకు అడ్డుపడి
చుట్టూ ఉన్న నురుగుని చూసి అసలు నిజం తెలుసుకుని
పరమాత్మకు ఒక్కటేమిటి?... లోకమంతా పనియని
ఏకవచనం పరమాత్మకే సొంతం..
జీవకాంతులు పెక్కులనీ....!
నిద్రలో మెలుకువలో పనిలో విశ్రాంతిలో
విన్నవన్నీ భ్రమయనీ .. మదిని తెలిసి
 చెప్పనివెన్నో మదిలోనే ఒక్క గుటకతో మింగేసి!
ప్రకృతే పరమాత్మ..,పరమాత్మే ప్రకృతనీ
విశ్వమంతా పరమాత్మే...నా ఉనికే భ్రమయని
ఆత్మలో నిన్నే నిలుపుకుని మమేకమై
నిన్నే పలవరించే నేను...నా ఉనికినే మరిచాను!!



No comments:

Post a Comment