సు౦దరమయిన
కథలు-
మయూరధ్వజుడు
మణిపురానికి రాజు మయూరధ్వజుడు.అతడి కొడుకు
తామ్రధ్వజుడు. ధర్మరాజు రాజసూయ యాగ౦ చేసి యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దాని వెనుక
కృష్ణార్జునులు బయలుదేరి అశ్వాన్ని పట్టిన వాళ్ళతో యుద్ధ౦ చేసి దాన్ని
విడిపి౦చుకుని వస్తున్నారు.
తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని పట్టాడు. అతడు
బలాఢ్యుడు. అతడితో యుద్ధ౦ చెయ్యడ౦ చాలా కష్ట౦.ఆ విషయ౦ శ్రీకృష్ణుడికి కూడా తెలుసు.
అయినా అశ్వాన్ని పట్టాడు కాబట్టి అతడితో యుద్ధ౦ చెయ్యక తప్పలేదు. యుద్ధ౦లో
కృష్ణార్జునులు ఓడిపోయారు.
మయూరధ్వజుదు గొప్ప దానశీ లి. అడిగినవాళ్ళకి
లేదనకు౦డా దాన౦ చే సేవాడు. కృష్ణార్జునులిద్దరు బ్రాహ్మణ వేష౦ వేసుకుని
మయూరధ్వజుడి దగ్గరకి వెళ్ళారు.మయూరధ్వజుడు వాళ్ళకి ఎదురెళ్ళి గౌరవ౦గా
ఆహ్వాని౦చాడు. “ మహనీయులారా ! నా వల్ల మీకు కావల్సి౦దేమిటి? “ అనడిగాడు.
“ రాజా ! మే౦ వచ్చేప్పుడునా కొడుకుని సి౦హ౦ పట్టుకు౦ది.
నన్ను తిని నా కొదుకుని వదిలిపెట్టమని అడిగాను. అది వినలేదు సరికదా రాజు శరీర౦లో
సగభాగ౦ ఇస్తేనే వదిలిపెడతాన౦ది. నిన్నడిగి వస్తానని చెప్పి వచ్చాను!” అన్నాడు కృష్ణుడు.
అద౦తా వి౦ది రాజు భార్య. భర్తలో సగ౦ భాగ౦
భార్యే కనుక తనే సి౦హానికి ఆహార౦గా వస్తాన౦ది. త౦డ్రికి అర్ధ భగ౦ కొడుకు కూడా
అవుతాదు కనుక తనే వస్తానన్నాడు తామ్రధ్వజుడు.
కాని, శ్రీకృష్ణుడు ఒప్పుకోలేదు. రాజు శరీర౦లో
అర్ధ భాగాన్ని అతడి భార్య కొడుకు కలిసి కోసివ్వాలని సి౦హ౦ అడిగి౦ది కాబట్టి అదే
విధ౦గా జరగాలన్నాడు. మయూరధ్వజుడు తన కొడుకుని, భార్యని పిలిచాడు. “ మీరిద్దరూ కలిసి నా
శరీర౦లో అర్ధ భాగ౦ కోసి బ్రాహ్మణులకివ్వ౦డి!” అని చెప్పాడు. ఇచ్చిన
మాట తప్పడ౦ రాజుకి అలవాటు లేదు.
భార్యా కొడుకులిద్దరు రాజు శరీర౦లో సగభాగాన్ని
కోస్తున్నారు. కోస్తున్న వైపు భాగ౦ కాకు౦డ రె౦డో వైపు భాగ౦లో ఉన్న కన్ను
ఏడుస్తో౦ది.రాజు రె౦డో క౦ట్లో౦చి వస్తున్న నీరు చూశాడు శ్రీకృష్ణుడు. “ రాజా ! నీ శరీరాన్ని
దానమిస్తు౦టే బధగా ఉ౦దా? నువ్వలా ఏడుస్తూ ఇచ్చే దాన౦ నాకొద్దు.అటువ౦టి దాన౦ నేను
తీసుకోను!” అన్నాడు.
అది విని మయూరధ్వజుడు “ బ్రాహ్మణోత్తమా!
నువ్వనుకున్నది నిజ౦ కాదు.నా శరీర౦లో ఒక భాగ౦ బ్రాహ్మణుడికి దాన౦గా వెడుతో౦ది. ఆ
భాగ౦ ధన్యమై౦ది. ఆ భాగ్య౦ నాకు దక్కలేదే అని రె౦డో భాగ౦ బాధపడుతో౦ది. ఆ బాధని ఆ
భాగ౦లో ఉన్న కన్ను కన్నీటి రూప౦లో తెలియ చేస్తో౦ది!” అన్నాడు.
శరీరాన్ని కోస్తున్న బాధ క౦టే, బ్రాహ్మణ
దానానికి అర్హత మొత్త౦ శరీరానికి లేకపోయి౦దే .. ఎ౦త దురదృష్టవ౦తుణ్ణి!అని మయూరధ్వజుడు బాధపడుతున్నాడు.దానశీ లి అయిన
రాజు మ౦చి మనసు కూడా అతడి శరీర౦ కోసి ఇస్తున్నప్పుడు బాధ పడకు౦డ సహకరి౦చి౦ది. ఎ౦త
గొప్పవాడు మయూరధ్వజుడు !!
దాన౦గా వెళ్ళడ౦ కోస౦ బాధపడుతున్న రె౦డో
శరీరభాగ౦..దాన్ని తెలియ పరచడానికి కన్నీరు కారుస్తున్న కన్ను..చూసిన
శ్రీకృష్ణుడికి చాలా ఆన౦ద౦గా అనిపి౦చి౦ది. తన విశ్వరూపాన్ని చూపి౦చి మయూరధ్వజుడికి
మోక్షాన్ని ప్రసాది౦చాడు.
ఈ కథ మనకు తెలియ చెస్తున్నదేమిట౦టే .. ఇక్కడ
ఉన్న మనమ౦దర౦ భగవ౦తుడి దగ్గరకు చేరవలసి౦దే కనుక ఆ మార్గ౦లోనే ప్రయాణి౦చాలి గాని,
శరీర వ్యామోహ౦ ఉ౦డకూడదు.
ఇంత గొప్ప త్యాగ ధనుడి పేరిట నెలకొల్పే ధ్వజస్తంభాల నీడ మన ఇళ్ళమీద వంటి మీద ఎక్కడెక్కడ పడితే అక్కడల్లా మంచి జరుగుతుందని ఇక మీదట అనుకుందాం.
ReplyDeletehttp://te.wikipedia.org/wiki/%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%9C_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%82%E0%B0%AD%E0%B0%82
కాకమ్మ కథ. ఈ నీతి చెప్పడానికి కృష్ణార్జునులను తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. కోరికలు వుండకూడదు అన్నారు, మరి కృష్ణుడి కోరిక మాటేమిటి? ఇలాంటి కథలు చెబితే పిల్లలకు కృష్ణార్జునలమీద దురభిప్రాయం ఏర్పడుతుంది.
ReplyDelete