About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాటి సాయిపథం _ నేటి బాబాలపథం! “సాయి సత్సంగం _ బాబాల సత్సంగం!” http://bhamidipatibalatripurasundari.blogspot.in/


నాటి సాయిపథం _ నేటి బాబాలపథం!  
సాయి సత్సంగం _ బాబాల సత్సంగం!

    గురువుగారి మాటలు మనస్సు మీద బాగా పని చెయ్యాలంటే కాస్తో కూస్తో భక్తి, మంచితనం కలిగి ఉండాలి.అటువంటి వాళ్ళు ఒకచోట చేరి మరికొంత మందికి జ్ఞానోపదేశం చేసి మంచి మార్గం వైపు నడిపించాలి.దాన్నే సత్సంగం అంటారు.ఆనాటి సత్సంగాన్ని వివరించారు బాబా.
   మనం కలుస్తున్న వాళ్ళల్లో గురువయినా,యోగయినా,సన్యాసి అయినా,మన చుట్టూ ఉండే మనుషులయినా ఎటువంటివారో తెలుసుకోవాలంటే వారు చేస్తున్న పనులు,ఇతరులతో వారి ప్రవర్తన,ఆహారపు అలవాట్లు వంటివి ముందుగా తెలుసు కోవాలి.వాళ్ళతో కలిసి కొంత కాలం గడిపితేనే అది సాధ్య పడుతుంది. ఆత్మశుద్ధి,వాక్సుద్ధి కలిగిన యోగులు,గురువులు,సన్యాసులు పైకి ఒక విధంగానూ మనస్సులో మరో విధంగానూ కాకుండా మంచితనం కలిగి,భగవద్బక్తితో ఆత్మనందాన్ని పొందుతూ ప్రశాంతంగానూ గొప్ప తేజస్సుతోనూ వెలుగుతుంటారు.
   ఎల్లప్పుడూ కళ్ళు మూసుకుని భగవంతుణ్నే తల్చుకుంటూ కూర్చుంటే రోజు గడవదు కదా...అందుకే సత్సంగం!సద్గురువు దగ్గర అందరూ చేరి భగవంతుని గురించిన కథలు, పాటలు, భజనలు, మాటలతో పాటు అందరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. స్నేహితుల మధ్య కష్ట సుఖాలు,సలహాలు, సంప్రదింపులు,సమస్యలకు పరిష్కారాలు దొరికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులో అలజడి లేనప్పుడు భగవంతుని మీద ఏకాగ్రత కూడా కుదురుతుంది.ప్రతి రోజూ మనం మానకుండా చేసే పనులు అనేకం ఉంటాయి. వాటిలో సత్సంగం కూడా చేరిస్తే మంచిది.
   జన్మ రాహిత్యం వరకు వెళ్ళలేక పోయినా జన్మ నిచ్చిన వారితో జన్మసాన్నిహిత్యాన్నయినా పొందచ్చు అన్నారు శ్రీసాయినాథుడు.
   
                                                                            *********

   సత్సంగం ఆనాడే కాదు...ఈనాడూ ఉంది. ఆనాటి సత్సంగమే పేరు రూపాంతరం చెంది మీటింగు పేరుతో పిలవబడుతోంది. మీటింగు ఏర్పాటు చేసిన వ్యక్తి చెప్పిన విషయాలు మనస్సుకి నచ్చినప్పుడు ఇంకో పది మందిని కూడగట్టుకుని వెళ్ళడం సహజమే!
   అప్పుడయినా ఇప్పుడయినా వాక్సుద్ధి, భక్తి, మంచితనం కలిగినవాళ్ళు ప్రత్యేకమయిన తేజస్సుతో కనిపిస్తారు. ఊసరవెల్లిలా ఎప్పటి కప్పుడు రంగులు మారిపోతున్న ఈనాటి సమాజంలో ఎంత కాలం కలిసి గడిపినా వారి వారి స్వభావాలు తెలుసుకోవడం కష్టమే! చేస్తున్న పనుల్లోనూ, ప్రవర్తనలోను పారదర్శకత లేనప్పుడు పరిస్థితుల్ని బట్టి మార్పులు తప్పవుగా మరి! శరవేగంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బాబాలు వారి జ్ఞానంతో ఏ పనిలో ఎంత ఆనందం ఉందో స్వానుభవంతో చెప్తున్నారు.వారికి పెద్దలు దాసోహం అంటూ ఉన్నారు. సామాన్యులు వాటిని ఆదరించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఈనాటి సత్సంగం.
   ఈనాటి సత్సంగాల్లో కూడా భజనలు,నాటికలు,పాటలు,సన్మానాలు వంటివి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ అంశాలలో పోటీలు పడుతూ...పోటీలు పెడుతున్నారు. అవసరాలు తీరడానికి ఇది కూడా ఒక మార్గమే! ఈనాటి బాబాలు ఆశించినట్టు సత్సంగాల వల్ల కుల,మత,రాజకీయ స్నేహాలు అభిమానాలు పెరిగి ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకుంటూనే ఉన్నారు.అది అందరికీ సాధ్య పడకపోయినా దానికి తగిన విశ్వాసం,వాక్పటిమ,దూరదృష్టి ఉన్నవారు రాణిస్తూనే ఉన్నారు.
   సన్మనాలు స్వయంగా చేయించుకునేవారు ఉన్నంత వరకు సత్సంగాలకు కొదువ లేదు!!


No comments:

Post a Comment