నాటి సాయి
ఒక గ్రంథం- నేటి బాబాలు గ్రంథసాంగులు
గ్రంథం రాయాలంటే కాలాన్ని ప్రేరేపించగల శక్తి, బుద్ధి , జ్ఞానం,
చైతన్యం, ఆసక్తి అన్నీ ఉండాలి. వాటికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలి.
ఆనాటి భగవంతుడు
బాబానే!
"భక్తులతో కలిసి జీవించిన ’బాబా’ అనే గ్రంథాన్ని
చదవగలిగేను కాబట్టే, బాబా జీవిత చరిత్రని రాయగలిగాను!" అన్నారు హేమాడ్ పంత్.
అది
గ్రంథం కానే కాదు, సాయి లీలామృతం! ఈ అమృతాన్ని సేవించిన వాళ్ళకి మరుజన్మ ఉండనే
ఉండదు. మోక్షాన్ని పొందుతారు.
విశ్వాసము, ప్రేమ, భక్తి లేనివాళ్ళు, ఆయన్ను
విమర్శించేవాళ్ళు, వాదించేవాళ్ళు ఈ అమృతాన్ని సేవించేందుకు అర్హులు కానేకారు.
మనుషులందరు
పవిత్ర నదీ జలల్లో స్నానం చేసి పునీతులవుతారు. వాళ్ళ వల్ల తనకు అంటిన పాప పంకిలం
పోవాలంటే ఋషులు, యోగులు, సద్గురువులు తమ జలాల్లో స్నానం చెయ్యాలని నదులు
కోరుకుంటాయన్నారు.
ప్రశాంతమైన ప్రదేశాన్ని చూసినప్పుడు “ఇటువంటి
ప్రదేశంలో కూర్చుని వేదపారాయణ చేస్తే మోక్షం కలుగుతుందని
బ్రాహ్మణులు...సద్గురువుని చూసినప్పుడు ఇటువంటి గురువు ఆశ్రయాన్ని పొందితే మనకు
మోక్షం కలుగుతుందని భక్తులు అనుకుంటారు.
మా భగవంతుడు శ్రీ సాయినాథుడే! అన్నారు
ఆనాటి భక్తులు.
భగవంతుడికి దగ్గరవాలంటే ప్రాపంచిక విషయాలమీద విరక్తి పెరగాలి. కోరిక
బలీయమైనదైతే దాని నుంచి రక్షించే మార్గాన్ని చూపించడానికి భగవంతుడు మనకొక సద్గురువుని చూపిస్తాడు.
ఆ గురువు
ఎవరో ఆయన్ను ఏ విధంగా చేరాలో తెలియనప్పుడు ఆ గురువే భక్తులని తన దగ్గరకు
చేర్చుకుంటాడు.
"మంచి అయినా, చెడు అయినా ఏది జరగాలన్నా భగవదాజ్ఞ ఉండాలి" అన్నారు శ్రీసాయినాధుడు.
భక్తుడికి ఉండవలసినది భగవంతుణ్ణి చేరాలన్న బలీయమయిన
కోరిక !!
********
ఒక
గ్రంథం రాయాలంటే వంద గ్రంథాలు చదవాలి. గ్రంథం రాసే విషయం పక్కన పెడితే ముందు చదవడానికి
ప్రేరణ కావాలి కదా...!
భగవంతుడి ప్రేరణతో చదవాలన్న కోరిక కలగాలే కానీ, రాయడమెంతసేపు ? ఈనాటి బాబాల చరిత్ర రాయాడానికి భగవంతుడు అశీర్వదించడేమో!
అయినా ఎవరి గ్రంధాలు వారే రాసేసుకోగల
గ్రంధసాంగులుండగా గ్రంధాలెందుకు ?
ఏ
కాలంలో అయినా విమర్శించే వాళ్ళని బాబాలు దగ్గరకు చేరనివ్వరు.
విశ్వాసం , భక్తి ,
ప్రేమ కలిగి వారిచ్చే తీర్ధ ప్రసాదాలు స్వీకరించి మోక్షానికి దగ్గరగా చేరగలిగిన
వారికి బాబాలిచ్చే తీర్ధం అమృతంగా అనిపిస్తుంది.
అటువంటి అనుభూతి పొందగలిగిన
వాళ్ళకే వారి లీలామృతపానానికి అర్హతను కలిగిస్తారు నేటి బాబాలు .
ఈనాడు భక్తులు తమకు అంటిన పాప పంకిలాన్ని నదీ స్నానం చేసి వదిలించుకోవాలనుకున్నా
నదులు మాత్రం అంగీకరించవు.
వారి పాపం పోవడం మాట అటుంచి ఆ పాపంతో నదుల జలరూపమే
హరించిపోయే పరిస్థితి.
ఈనాటి బాబాలు, యోగులు, సన్యాసులు తమ జల్లాలో స్నానం
చేయ్యడం వల్ల తమకు అంటిన పాపం పెరిగి జలం హరించి పోయి ఇసుక తిన్నెలే మిగులుతాయన్నది
నదీమ తల్లుల ఆందోళన !
ప్రశాంతమైన ప్రదేశం కానీ, వాతావరణం కానీ
కనిపించినప్పుడు గ్రంధ పఠనం , వేద పారాయణ, భజనలు, మోక్షం వంటి వాటి సంగతి ఏమోగాని, భక్తులందరు బాబాల చుట్టూ చేరి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం
దొరొకినట్టే !
తీర్థప్రసాదాలతో తమ
భక్తుల్ని తృప్తి పరచగల బాబాల అండ ఉండగా వేరే భగవంతుడెందుకు ?
ప్రాపంచిక విషయాల మీద రక్తి పెరగడం వల్లే
బాబాలు పెరుగుతున్నారు. కోరిక బలీయమైనది అయినప్పుడు బాబాలే తమ కోరికలతో పాటు భక్తుల
కోరికలు తీరే మార్గం కూడా చూపిస్తున్నారు.
బాబాలను చేరే మార్గం తెలియాలే గాని,
దొరికిన భక్తుల్ని బాబాలు అసలు వదలరు.
ఏది జరగాలన్నా భక్తులకు ఉండవలసింది బాబాలను చేరాలన్న బలీయమైన కోరిక !!
No comments:
Post a Comment