About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

బిక్ష మోక్ష సాధనం -బిక్ష జీవిత సాధనం

నాడు సాయి పథం- నేడు బాబాల పథం

బిక్ష మోక్ష సాధనం -బిక్ష జీవిత సాధనం
   బిక్షాటన చెయ్యవలసిన అవసరం సాయికి లేదు. ఎవర్నీ ఏదీ యాచించకుండా కూర్చున్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన శక్తి సాయికి ఉంది.
   ఒక చేతిలో డబ్బా రెండవ చేతిలో జోలె పట్టుకుని, ఘన పదార్ధాల్ని జోలెలోను, ద్రవ పదార్ధాల్ని రేకు డబ్బాలోను వేసుకునేవారు. ప్రతి రోజూ పన్నెండు గంటలకి సాయి బిక్షాటన పూర్తయ్యేది. అన్ని దానాల్లోకి అన్న దానం గొప్పది అనేవారు శ్రీసాయినాథుడు.
   తను ఉన్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన సాయి బిక్షాటనకి ఎందుకు వెడుతున్నారు? అనేది భక్తుల సందేహం.
    ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే జన్మ జన్మలకు ఆహారానికి లోటు ఉండదు. మనం వేసే బిక్ష ద్వారా ఇతరుల ఆకలి తీర్చడమే కాదు...పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చు. అటువంటి మోక్ష మార్గాన్ని భక్తులకు చూపించడం కోసమే సాయి బిక్షాటన !
   బిక్షకి ఏ ఇంటికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయించుకుని ఆ ఇళ్ళ వరకే వెళ్ళేవారు. బిక్ష దొరికినా...దొరక్కపోయినా వేరే ఇళ్ళకు వెళ్ళేవారు కాదు.
   దొరికిన బిక్షలో కొంతభాగం మట్టి పాత్రలో వేసి బయట పెట్టేవారు. నోరులేని పక్షులకు జంతువులకు అది ఆహారంగా ఉపయోగించేది. దాని ద్వారా భూత దయ ఉండాలని తెలియ చెప్పడమే సాయి ఉద్దేశ్యం.
   మిగిలిన దాన్ని తనతో కలిసి జీవిస్తున్న భక్తులతో కలిసి పంచుకుని తినేవారు. సాయికి రుచులు, కోరికలు లేవు. బిక్ష రూపంలో దొరికిన వాటిని అన్నిటినీ కలిపేసి తినేవారు.
   అకలి తీరడమే ముఖ్యం కాని, రుచిగా తినడం కాదు. మంచి కార్యాలు చేస్తూ మోక్ష మార్గం వైపు పయనించడానికి ఉపయోగించే శరీరమనే సాధనాన్ని పని చేయించడానికే ఆహారం అనేవారు.
   ఉన్నదంతా ఒక్కళ్ళే తినెయ్యకుండా ఆకలి అన్ని ప్రాణులకీ ఉంటుంది కనుక అందరితో కలిసి పంచుకోమనీ...సహ జీవనం మంచిదనీ చెప్పారు శ్రీసాయినాథుడు !
         
                                                           ********

   బిక్షాటన చెయ్యవలసిన అవసరం ఉందా...లేదా అనే విషయం పక్కన పెడితే అనుకున్నది మాత్రం బిక్షాటన చేసి తీరాలనే ! ద్రవ పదార్ధాల బదులు ద్రవ్యము, ఘన పదార్దాల బదులు బియ్యము.
   అన్ని దానాలకంటే అన్నదానమే గొప్పది కదా ! అన్నమయితే నేమిరా...మరి బియ్యమయితే నేమిరా ? కాలాన్ని బట్టే కొంచెం మార్పు అంటున్నారు ఈనాటి భక్తులు. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం, ఆకలి లేని వాళ్ళకి బియ్యం !
   నెత్తి మీద పెట్టుకుని అమ్మోర్ని తెచ్చినా...పళ్ళెంలో చెంబు పెట్టుకుని వచ్చినా...గంగిరెద్దుని తోలుకొచ్చినా... బండి చుట్టూ కాషాయ గుడ్డలు కట్టి, మైకులు పెట్టి పాటలతో హోరెత్తించినా...గుడి కట్టించాలని చెప్పినా...అన్న దానమని పలికినా...బిక్షాటన మోక్షమని చాటినా... మొత్తానికి తనదైనా ఇతరులదైనా పొట్ట నింపుకోవడానికేగా. వేసిన వారికి వేసినంత మహదేవా...తిన్న వారికి తిన్నంత మహదేవా !
    తెల్లవారితే ఏ ఏ వీధులు తిరగాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. ఏ దేవుణ్ణి తలిస్తే బాగా బిక్ష దొరుకుతుందో ఆ దేవుడికి తగిన విధంగా నలుపు, తెలుపు, పసుపు, కాషాయాలు ధరించి చూసే వాళ్ళకి భక్తి కలిగేలా చేస్తారు.
   ఉదయాన్నే బయలుదేరి తీసుకెళ్ళిన జోలె నింపుకునే వరకు ఇంటింటికీ, వీధి వీధికీ తిరిగి తిరిగి వచ్చినంత వరకు సేకరించి మొయ్యలేనంత బరువుతో ఇంటికి చేరతారు.
   ఏ రోజు బరువు ఆ రోజుకే ! బరువు పెంచుకోవడమే గాని, వెను తిరగ కూడదు అన్నదే మొక్కు !
తెచ్చుకున్న దాన్ని దాచుకోవడమే గాని పంచుకోవడం ఉండదు. పుచ్చుకోవడమేగాని, ఇచ్చుకోవడం రానప్పుడు భూత దయకు దారేది ? జోలె బరువు పెరిగిందంటే భక్తుల భక్తి పెరిగినట్టే ! భక్తులు పెరిగారంటే పాపభీతి పెరిగినట్టే! బిక్ష అడుక్కున్న వాడికి అడుక్కున్నంత !!
  


No comments:

Post a Comment