About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సాయి భక్తుల భావన – స్వామీజీ భక్తుల భావన


నాడు సాయి పథం-నేడు బాబాల పథం
సాయి భక్తుల భావన స్వామీజీ భక్తుల భావన
   సంసారమనే సముద్రాన్ని దాటడం అందరికీ కష్టమయిన విషయమే ! ఎంత ధనం కూడ బెట్టినా ఫలితం ఉండదు. సంసార సముద్రంలో జీవిత నావ ఎటు పడితే అటు నడుస్తుంది.
   ఆ సమయంలో నావను గమ్య స్థానానికి చేర్చే మార్గాన్ని చూపించగల గురువు కావాలి. అతడు కూడా సద్గురువై ఉండాలి.
   తన భక్తుల్ని ముక్తి మార్గం వైపు నడిపించి గమ్య స్థానం చేర్చగలిగిన దిక్సూచి వంటివాడు సద్గురువు శ్రీసాయి నాథుడు అన్నారు సాయి భక్తులు.
   ఆయనే స్వయంగా మా నుదిటికి విభూతిని దిద్ది తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినప్పుడు మనసు సంతోషంతో ఉప్పొంగి కళ్ళ వెంట ఆనందభాష్పాలు కారేవి. సాయి మీద ప్రేమ మహాసముద్రంలా పొంగేది” అన్నది అనాటి సాయి భక్తుల మనోగతం.
   గురువుగారి చేతి స్పర్శకు,  ఆయన ఆశీస్సులకి కోరికలతో నిండిన ఆత్మ అగ్నితో పునీతమైనట్టు పరిశుద్ధత పొంది జన్మజన్మల పాపం నశించి పోతుంది.
   ఆయనను దర్శించగానే ఆనందంతో గొంతు మూగబోయి మనసంతా ’అహం బ్రహ్మస్మి’ అనే భావన నిండిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
   భగవంతుణ్ణి ఏ రూపంలో దర్శించుకోవాలని అకుంటున్నామో అదే రూపాన్ని సద్గురువు సాయినాథుడిలో దర్శించగలం.
   అహంకారాన్ని పోగొట్టి మనోబలాన్ని అందించి, భక్తి మార్గాన్ని ఉపదేశించి, మనసుని మంచి మార్గం వైపు మళ్ళించి, నమ్ముకున్న వారిని ముక్తి మార్గంలోకి నడిపిస్తూ సంసార సముద్రాన్ని దాటించి ఒడ్డుకు చేర్చడమే సద్గురువు బాధ్యత.
   నమ్మిన వారిని ముళ్ళ మార్గం నుండి ముక్తి మార్గంవైపు నడిపిస్తాడు శ్రీసాయినాథుడు!
                                                        ********
      డబ్బుంటే ఏ పనయినా జరిగిపోతుంది అనుకునే రోజులివి. సంపాదన ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా  జీవితం సాగిపోతుంది అనుకుంటే పొరపాటే !
   జీవితాన్ని ఎలా గడిపితే ప్రశాంతంగా ఉంటామో ఆలోచించుకోవాలి. ప్రశాంతతని,    మనశ్శాంతిని ధనంతో కొనలేము. ఎంత గొప్పవాడైనా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. గుడికి వెళ్ళి  భగవంతుణ్ణి ఒకసారి దర్శించి పెద్ద మొత్తం హుండీలో వేస్తే చాలు చేసిన పపాలన్నీ పటాపంచలైపోతాయని అనుకుంటున్నారు ఈనాటి భక్తులు.
   ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ భగవంతుడి ప్రమేయంతోనే జరుగుతూ ఉండడం.
   ఆ విషయాన్ని గ్రహించ లేక ధనం ఉంటేనే ప్రశాంతత ఉంటుంది...అది లేకపోతే ప్రశాంతత ఉండదు అన్నది ఈనాటి స్వామీజీ భక్తుల మనోగతం.
   అసలు జీవించడమంటే ఏమిటో తెలియడానికే సద్గురువు కావాలి. ఈ నాటి స్వామీజీలు తమకి ఇష్టమైన మార్గంలో జీవిస్తూ జీవించడం ఇతరులని జీవింప చెయ్యడం సద్గురువు బాధ్యత. కాని,మార్గంలో జీవిస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారానికి బదులు ధన సాక్షాత్కారానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు.
    అందువల్ల భక్తులు కూడా అదే మార్గం వైపు పయనిస్తున్నారు. సద్గురువులు ఎప్పుడూ పరిశుద్ధమైన మనస్సుతో ఆత్మ సాక్షాత్కారం పొందాలన్న తపన, ముక్తి మార్గం వైపు పయనించాలన్న కోరిక కలిగిన మంచి శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటారు.
  సద్గురువుకి మంచి శిష్యుడు దొరకడం ఎంత కష్టమో...మంచి శిష్యుడికి సద్గురువు దొరకడం కూడా అంతే కష్టం.
   భూమి మీదకు వచ్చేప్పుడు ఏదీ తెచ్చుకోము... భూమిని వదిలి వెళ్ళేప్పుడు వెంట ఏదీ తీసుకుని వెళ్ళము.

   ఇది తెలుసుకున్న స్వామీజీల ఆశీర్వాదమే ఈ నాటి భక్తులకి ముక్తి మార్గం చూపించే దిక్సూచి!!   

No comments:

Post a Comment