About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత:పలకరించిన మానసవీణ – పులకరించిన మామిడిపండు

  

అంశం: మానసవీణ 

పలకరించిన మానసవీణ పులకరించిన మామిడిపండు

దేవర్షి నారదుడు బహుధన్యుడు.

చేస్తుందతడి మానసవీణ..

 సదా హరిగుణ గానం!

మానసం వీణారాగం..

చేతి వీణ మ్రోగిస్తుంది రాగం  

మానసవీణ కలిగిస్తుంది

నారదుడికి.. భక్తిపారవశ్యం

చేతివీణతో జగత్తుకి అందిస్తున్నాడు

 ఆనంద పారవశ్యం!

సంకల్ప బలం

భగవన్నామ స్మరణలోనే..

లోకాల్ని సందేశంతో నింపుతోంది

 నారదుడి మహతివీణ!

నారాయణ స్మరణతో మానసవీణ

శ్రుతి చేసుకుంటాడు..

ముకుంద గీతాలతో..

జగత్తుకి వీనులవిందు చేస్తాడు

మనస్సులో పరవశిస్తాడు..

జగత్తుని పరవశింపచేస్తాడు!

సుఖదుఃఖాలు రమ్మంటే రావు.

వద్దంటే పోవు..

నిరూపణ చెయ్యాలనుకున్నాడు

 శ్రీకృష్ణుడు !

నారదుడితో బయలుదేరాడు

విహారయాత్రకు...

ఆపాడు అందమైన వనంలో

 అందమైన సరస్సు వద్ద రథం...!

దాహంతో నీటిని దోసిలితో

తీసుకున్నాడు నారదుడు..

స్నానం చేయకుండా నీటిని త్రాగకు..

ప్రమాదమన్నాడు కృష్ణుడు!

వారిస్తున్నా వినలేదు.. దాహార్తి తీర్చుకున్నాడు...

తనను తాను మరిచాడు..

స్త్రీ రూపం పొందాడు నారదుడు!

శ్రీకృష్ణమాయా ప్రభావంతో

 ఋషిపత్నిగా జీవించాడు

కలిగిన అరవైమంది సంతానం...

కళ్ళముందే విగతజీవులయ్యారు

స్ర్తి నారదుడు ఖిన్నుడయ్యాడు..

దుఃఖ భారంతో!

ఆకలి బాగా పెరిగింది..

మామిడి చెట్టుకి కనిపించిందొక పండు 

భర్త ఋషి, అరవైమంది పిల్లల

 శవాల్ని గుట్టగా పేర్చాడు.

శవాల గుట్టనెక్కి

పండును అందుకున్నాడు..!

తినబోతున్న స్త్రీ రూప నారదుణ్ని

బ్రాహ్మణుడు అడ్డగించాడు

స్నానం చేసి పండు తిను..

మృతులకు మంచిదన్నాడు!

మామిడి పండు ఉన్న చేతిని

పైకెత్తి పట్టుకుని

నారదుడు కొలనులో దిగాడు ..

పురుషుడిగా మారాడు ..

మారని మామిడిపండు హస్తం..

నారదుణ్ని వెక్కిరించింది!

కృష్ణుడు నవ్వాడు.. నారదుడు

పండుతో సహా నీటిలో మునిగాడు..

పైకి వచ్చిన నారదుడి చేతిలో

 మామిడిపండు  వీణగా మారింది..

నారదుడి వీణ పేరు మహతి!

చెప్పాడు శ్రీకృష్ణుడు!

మహతిని చేతితో మీటాడు..

నారదుడి మానసవీణ పులకరించింది

నారాయణ! నారాయణ! స్మరణ గానంతో..

జగత్తు పరవశించింది!

 

No comments:

Post a Comment