About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత

గ్రంథాలయ వారోత్సవాల వేడుకల్లో మహిళా దినోత్సవ సందర్భంగా 19-11-2022 ఠాగూర్ స్మారక గ్రంథాలయ వేదికపై

 

కాలానికే జవాబిచ్చిన మహిళాశక్తి    (కాలంతో మగువ)

వేదకాలంలో  మహిళలు చదువుకున్నారు.

ఋగ్వేదకాలంలో తమకు తామే భర్తను ఎంచుకున్నారు!

ఇస్లాం రాజుల ఆక్రమణలుమొఘల్ సామ్రాజ్యం, మతాలు .. 

వంటివెన్నో మహిళల స్వేచ్ఛని, హక్కుల్ని హరించాయి!

సతీసహగమనంబాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల నిషేధం ...

నిర్బంధాలు, ఆంక్షలు విప్లవాత్మక ఉద్యమాల్లో ఎదుర్కొన్నారు!

ముస్లిం ఆక్రమణ తెచ్చింది భారతీయ సమాజంలో పరదా ఆచారం..

రాజస్థాన్ రాజపుత్రుల్లో నడిచింది జౌహర్ అనాచారం..  

ఆలయస్త్రీలుగా ఉంటూ దేవదాసీలు అనుభవించారు లైంగిక వేధింపులు! 

హిందూ క్షత్రియ రాజుల్లో విస్తృతంగా వ్యాపించింది బహుభార్యాత్వం ..

రాజకీయ, సాహిత్య, విద్య, మత రంగాల్లో రాణిస్తూనే ఎదిరించారు!

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా..

గోండు రాణి దుర్గావతి.. సాగించింది పదిహేనేళ్ళు పరిపాలన..

మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది చాంద్ బీబీ..

యోధురాలు, పాలకురాలు, మంచి తల్లిగా జిజియాబాయి!

భక్తి ఉద్యమానికి మీరాబాయి, హిందూ భక్తికి  అక్క మహాదేవి,

రామి జనాభాయి, లాల్ దేడ్... సాధు-కవయిత్రులు..

భక్తి ఉద్యమం తరువాత సిక్కుల మొదటి గురువు గురునానక్ మహిళే!

బ్రిటిషువారికి వ్యతిరేకంగా  తిరుగుబాటుని నడిపించింది ఝాన్సీ రాణి

ముస్లిం మహిళ మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతిని విమర్శించింది!.

భారత జాతీయకాంగ్రెసుకు అధ్యక్షురాలు,

రాష్ట్ర మొదటి గవర్నరు.. సరోజినీ నాయుడు..  

పదిహేనేళ్లు భారతదేశపు ప్రధానమంత్రిగా  ఇందిరా గాంధీ! 

నేటి భారత దేశానికి రాష్ట్రపతి కూడా మహిళే!

ప్రాచీనకాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్నమహిళ 

మధ్యకాలంలో కష్ట నష్టాల ప్రవాహాన్ని నెట్టుకుంటూ.. ఎదురీదుతూ...

కాలంతో ప్రయాణిస్తూ.. అన్నింటా నేనంటూ .. కాలానికే జవాబిచ్చింది!


No comments:

Post a Comment