About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత-రంగనాథుడి కోవెల- గోదాదేవికి మమతల కోవెల

 

రంగనాథుడి కోవెల- గోదాదేవికి మమతల కోవెల

విష్ణువే చిత్తములో గలవాడు.. శ్రీ విష్ణుచిత్తుడు..

తులసీదళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు..

ముద్దుగా కోదై అని పిలిచాడు.. ఆమే గోదా!

నేర్పాడు వైష్ణవ మతంలోని ప్రేమతత్త్వ  జ్ఞానాన్ని,, 

13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించింది!

స్త్రీలు చదువుకోరాదనే వాదనలు లేవనడానికి

12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం..

చదువు, జ్ఞానం అందరిదీ అనడానికి.. చిరంజీవ సాక్ష్యం!

గోదా మమతల కోవెలలో శిల్పం శ్రీరంగడు!

గోదాదేవి తన వలపు, రంగడికి పంపిన ప్రేమలేఖలు,

భావావేశ అనురాగ సందేశాలు, ఆశలు, ఆశయాలు,

అలకలు, కోపాలు. నాచ్చియార్ తిరుమోళి..

గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత కావ్యం!

గోదా మమతల కోవెలలో కావ్య నాయకుడు శ్రీరంగడు!

గోదా చిత్తంలో విష్ణువు,. విష్ణువు చిత్తంలో గోదా!

గ్రహించాడు విష్ణుచిత్తుడు ..పిలిచాడు ఆండాళ్!

గోదా మమతల కోవెలలో మథురభావన శ్రీరంగడు!

గోదా నెలరోజులు దీక్షవహించి..పాటించింది శ్రీవ్రతం

ఆ నారాయణుడే సాధనకు లక్ష్యం..ఆయనే వ్రతం..

ఆయనే వ్రత విధానం, ఆయనే వ్రత సాధనం.!

ఆ నారాయణుడే సాధనకు లక్ష్యం..

ఇది మధురమైన భక్తి, రసమయ భక్తి..

గోదాదేవి మమతల కోవెలలో పాశురాలే శ్రీరంగడు!

జ్ఞాన బోధన చేసి వ్రత సాధన చెప్పింది

వ్రతం పూర్తికాగానే ఫలం సిద్ధించింది.

శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కన్పించాడు

రంగడు  పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకు పంపాడు

గోదను తీసుకొని రమ్మని విష్ణుచిత్తులవారికి చెప్పాడు

గోదను వివాహం చేసుకున్నాడు.. లీనమైంది రంగనాథునిలో

గోదాదేవి మమతల కోవెలలో ఒదిగిపోయాడు శీరంగనాథుడు!

No comments:

Post a Comment