About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత -శీర్షిక:- దైవనామస్మరణం

 

అంశం:-స్మరణం శీర్షిక:- దైవనామస్మరణం

(సాహితీరసస్రవంతి గ్రూప్) 31-01-2024
భక్తితో భగవన్నామం జపించడమే దైవస్మరణం 
ఆర్తిగా, ఆత్రంగా హృదయంతో చేసే స్మరణం
భవ రోగ దివ్య ఔషధం కలియుగానికి..!
“కేవలం కలౌ తు నామమాత్రేణ పూజ్యత్‌ భగవాన్‌ హరి:
పరమాత్మను ఒప్పించడానికి, మెప్పించడానికి,
భగవంతుని అనుగ్రహానికీ, సులభమైన మార్గం,
మానవాళికి అందిన మహావరం నామస్మరణం!
ప్రదర్శనకు, ఆర్భాటానికి, స్థాయీస్థానాల
ప్రదర్శనలకు, అద్భుతాలు, మహిమలు, లీలలు,
అభూత శక్తుల విపరీత ధోరణులకు
కాకూడదు స్మరణం చిహ్నం!
మనోహరంగా మనోభావంగా సాగాలి స్మరణం
మనసులో మననం.. చెయ్యాలి హృదయస్తం...!
రూప నామ స్మరణం తేలిపోవాలి ధ్యానత్వంలో
లెక్కపెడుతూ జరిపే స్మరణం.. లెక్కల స్మరణం!
నామస్మరణతో రుక్మిణి త్రాసులో వేసింది తులసిదళం
కృష్ణుడి బరువు సరితూగింది. అమృతమై, అతిశయమై..
అలరారారే దైవనామ స్మరణం శక్తిని నిరూపించింది!
నిత్య దైవనామస్మరణం సంకీర్తనం...! పోతనామాత్యులు
భక్త తులసీదాసు, భక్తరామదాసు వంటి
భాగవతోత్తములు దైవ నామసంకీర్తనలో సేదతీరారు
సంత్‌ తుకారామ్‌, సతీ సక్కుబాయి
పాండురంగణ్ని ప్రసన్నం చేసుకున్నారు!
దైవబలం కావాలి. సర్వేశ్వరుడి సహకారం అందాలి.
అరిషడ్వర్గాల్ని జయించాలి.. అందుకు కావాలి
ఖడ్గం! అదే దైవ నామస్మరణం!
భగవన్నామంతో తీసుకోవాలి ఊపిరి  
స్మరణంతో భగవంతుడ్ని చూడగలగాలి.!
సంసారసాగరాన్ని దాటించే నావ నామస్మరణం
భగవన్నామస్మరణ చేసే స్థలం పుణ్యక్షేత్రం
దైవనామ స్మరణం జరిగే ప్రతి గృహం ఒక పుణ్యతీర్థం!.

No comments:

Post a Comment